హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వినాశనం వైపు నడిపించి కేసీఆర్ పొలిటికల్ టెర్రరిస్టుగా తయారయ్యారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ సంపన్న రాష్ట్రంగా తెలంగాణను ఇస్తే.. బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాగ్ ప్రకారం రాష్ట్రం ప్రస్తుతం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిందన్నారు.
రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ప్రజలను తాగుడుకు బానిసలను చేశారని ఫైర్ అయ్యారు. లిక్కర్ తో ప్రజలను పీక్కుతిని రూ.2 లక్షల కోట్లు సమకూర్చుకున్నారని తెలిపారు. కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లను కేసీఆర్ దోచుకున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నీళ్లే ఇప్పుడు పొలాలకు పారుతున్నాయని పేర్కొన్నారు.