ఎన్నికల్లో గెలిచేందుకు కమల్‌నాథ్‌ క్షుద్రపూజలు చేయిస్తుండు : శివరాజ్‌ సింగ్‌ చౌహాన్

ఎన్నికల్లో గెలిచేందుకు కమల్‌నాథ్‌ క్షుద్రపూజలు చేయిస్తుండు :  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్

మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ పై ఆ రాష్ట్ర సీఎం  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు కమల్‌నాథ్‌ క్షుద్రపూజలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఉజ్జయినిలో అయన పేరిట  క్షుద్రపూజలు చేస్తున్న ఫోటోలను తాను చూశాననన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో  వైరల్‌ అవుతోందని చెప్పుకోచ్చారు. కమల్‌నాథ్‌ ఫొటో ముందు  నిమ్మకాయలు, పూలు, క్షుద్రపూజల సామగ్రి ఉన్నాయని   శివరాజ్‌ సింగ్‌  చెప్పారు. 

ఎన్నికల్లో గెలిచి..  సీఎం పదవి చేపట్టాలనే కోరికతోనే కమల్‌నాథ్‌ ఇలాంటి క్షుద్రపూజలు చేయిస్తున్నారని శివరాజ్‌ సింగ్ ఆరోపించారు.  కమల్‌నాథ్‌ ఇలాంటి  పూజలు చేయించడం తనకు  ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని, వాళ్ల అభిమానాన్ని పొందాలంటే అభివృద్ధే మార్గమని ఆయన తెలిపారు. కాగా  230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ శాసనసభకు నవంబర్ 17న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.