రాఘవ లారెన్స్ బెంజ్‌‌‌‌‌‌‌‌మూవీలో మడోన్నా

రాఘవ లారెన్స్ బెంజ్‌‌‌‌‌‌‌‌మూవీలో మడోన్నా

ప్రేమమ్,  శ్యామ్ సింగరాయ్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మడోన్నా సెబాస్టియన్‌‌‌‌‌‌‌‌.. గత కొన్నాళ్లుగా తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. తాజాగా కోలీవుడ్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆమెకు మరో క్రేజీ ఆఫర్ లభించినట్టు సమాచారం. రాఘవ లారెన్స్ హీరోగా ‘బెంజ్‌‌‌‌‌‌‌‌’ అనే యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే.  ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకుడు. ఇందులో మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా సంయుక్త,  ప్రియాంక అరుళ్ మోహన్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రెస్టీజియస్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో మడోన్నా కూడా జాయిన్ అయినట్టు సమాచారం. 

ఇప్పటికే తను షూటింగ్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఖైదీ,  విక్రమ్, లియో,  కూలీ చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమాటిక్‌‌‌‌‌‌‌‌ యూనివర్స్‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రం వస్తోంది. లోకేష్‌‌‌‌‌‌‌‌ కనగరాజ్ దీనికి కథను అందిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. లోకేష్ తన సినిమాటిక్‌‌‌‌‌‌‌‌ యూనివర్స్‌‌‌‌‌‌‌‌లోని పాత్రలను మరో సినిమాలోని పాత్రలకు లింక్ చేయడం తెలిసిందే. 

‘లియో’ చిత్రంతో హీరో లియోదాస్‌‌‌‌‌‌‌‌  చెల్లెలు ఎలిసా దాస్‌‌‌‌‌‌‌‌గా నటించింది మడోన్నా. అందులో ఆ పాత్ర చనిపోతుంది.  ఇప్పుడు మడోన్నాను ఇందులోకి తీసుకోవడాన్ని బట్టి ‘లియో’ సినిమాకు ‘బెంజ్‌‌‌‌‌‌‌‌’ చిత్రం ప్రీక్వెల్‌‌‌‌‌‌‌‌ కానుందని అర్థమవుతోంది.