జాతిరత్నాలు తరహాలో మహానటులు

జాతిరత్నాలు తరహాలో మహానటులు

అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించిన సినిమా ‘మహానటులు’. అశోక్ కుమార్ దర్శకత్వంలో  అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మించారు. ఈ నెల 25న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. 

ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘ఇప్పటిదాకా డిఫరెంట్ మూవీస్ చేశాను కానీ కామెడీ జానర్ టచ్ చేయలేదు. ఫన్, హిలేరియస్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో  రూపొందించిన చిత్రమిది. మన చూట్టూ ఉండే ఓ నాలుగు క్యారెక్టర్స్ కథలో ఉంటారు. 

ఈ నలుగురు టీమ్‌‌‌‌‌‌‌‌గా మారి మహానటులు అనే యూట్యూబ్ ఛానెల్‌‌‌‌‌‌‌‌ను ఎలా డెవలప్ చేశారు అనేది కథ. ‘జాతిరత్నాలు’ తరహాలో హిలేరియస్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ ఉంటుంది’ అని చెప్పారు.  ఈ చిత్రానికి కథ, మాటలు - పి సుధీర్ వర్మ అందించగా, మార్కస్ ఎం సంగీతం అందించాడు.