Hyderabad : మహంకాళి ఠాణా పోలీసులకు వైద్య పరీక్షలు

Hyderabad : మహంకాళి ఠాణా పోలీసులకు వైద్య పరీక్షలు

పద్మారావునగర్, వెలుగు: మహంకాళి పోలీస్ స్టేషన్ లో బుధవారం స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్, డాక్టర్​మోహన్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ సౌజన్యంతో పోలీసులకు కంటి, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సైదయ్య మాట్లాడుతూ.. పోలీస్​సిబ్బంది విధి నిర్వహణలో బిజీగా ఉంటూ తమ ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తారని తెలిపారు. ఇలాంటి మెడికల్ క్యాంప్​లు వారికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వైద్య శిబిరం నిర్వహించడానికి చొరవ చూపిన సీఐ పరశురామ్​ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో డీఐ రంగారెడ్డి, ఎస్సైలు సందీప్​ రెడ్డి, శ్రీధర్, ప్రసాద్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.