మహారాష్ట్రలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

మహారాష్ట్రలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వసాయ్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు  పట్టాలు తప్పింది.    అక్టోబర్ 27 న సాయంత్రం  కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పాయి.  ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం .. ప్రాణనష్టం  కానీ జరగలేదని తెలుస్తోంది.  స్థానిక అధికారులు, రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.  పట్టాలు తప్పడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది. 

గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో  కాసేపు  పన్వేల్- వసాయ్ మార్గంలో  రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.