ముంబైలో ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ !

ముంబైలో ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ !

మహారాష్ట్రలోని ముంబైలో ఇంటర్ సెకండియర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ అయ్యిందనే వార్త దావనంలా వ్యాపించింది. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన  విద్యార్థుల ఫోన్ లో పేపర్ లీకేజీకి సంబంధించిన వివరాలు లభ్యమయ్యాయి. పేపర్ లీకేజీకి ప్రధాన సూత్రధారి మలాడ్ లోని ఓ ప్రైవేట్ ట్యూషన్ టీచర్ ముకేశ్ సింగ్ యాదవ్ ను విలే పార్లే స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే క్వశ్చన్ పేపర్ ను ఫొటోను వాట్సాప్ గ్రూప్ లో పంపినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే దీని వెనుక ఎవరున్నారనేది తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వివరాల కోసం

సోనియా రాజీనామా చేయాల్సిన అవసరంలేదు

మణిపూర్ సీఎం ఎంపికపై తర్జనభర్జన