బండి సంజయ్ యాత్ర తెలంగాణలో మార్పు తెచ్చే యాత్ర

బండి సంజయ్ యాత్ర తెలంగాణలో మార్పు తెచ్చే యాత్ర

వికారాబాద్: బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తెలంగాణలో మార్పు తీసుకువస్తుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.  తెలంగాణ సీఎం కేసీఆర్.. కేవలం తన కుటుంబం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌజ్‎లో కూర్చొని మాట్లాడితే.. బండి సంజయ్ మాత్రం రైతుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డి పేటలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రలో ఫడ్నవీస్ పై వ్యాఖ్యలు చేశారు.

‘బండి సంజయ్ రైతుల మధ్య కూర్చుని వారి కష్టాలు తెలుసుకుంటున్నరు. కేసీఆర్ ఎప్పుడైనా రైతులతో కూర్చున్నరా? మీరే ఒకసారి ఆలోచించండి. సీఎం ఫాంహౌజ్‎లో కూర్చొని పథకాలను రచించి ఏ విధంగా దోపిడీ చేయాలో ప్రణాళిక రూపొందించి దోచుకుంటున్నరు. సీఎం కేసీఆర్ అనేక సబ్సిడీలను నిలిపేశారు. ధరణిని అమలు చేయడం లేదు. రుణమాఫీ పూర్తిగా ఇవ్వడంలేదు. రైతుల సర్కార్, ప్రజాస్వామిక సర్కార్ రావాలంటే బండి సంజయ్ పాదయాత్రను ఆశీర్వదించాలని కోరుతున్నా. తెలంగాణలో కేసీఆర్‎కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది’ అని ఫడ్నవీస్ అన్నారు.