దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు వస్తున్నాయి. ఇవాళ ఒక్క రోజులోనే మహారాష్ట్రలో కొత్తగా మరో 68 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 40 కేసులు ఒక్క ముంబైలోనే వచ్చినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి చేరినట్లు పేర్కొంది. అయితే ఇప్పటి వరకు 259 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.
COVID19 | Maharashtra reports 12,160 fresh cases & 11 deaths today; Active cases 52,422. Omicron case tally 578, of these, 259 patients have been discharged pic.twitter.com/tewqB7P8Ek
— ANI (@ANI) January 3, 2022
ఇక మహారాష్ట్రలో ఇవాళ ఒక్క రోజే కొత్తగా 12,160 కరోనా కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 11 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 52,422 ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.