దొంగ‌త‌నానికి వ‌చ్చి .. మ‌హిళ‌ను రైలు నుంచి తోసేసిండు

దొంగ‌త‌నానికి వ‌చ్చి .. మ‌హిళ‌ను రైలు నుంచి తోసేసిండు

ముంబై దాదర్ రైల్వే స్టేషన్ లో  దారుణం జరిగింది. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ మహిళను రైలు నుంచి  కిందకు  తోసేశాడు.  నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   బెంగళూరు - ముంబై CSMT ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆగస్టు 6 రాత్రి 8.30 గంటలకు    రిజర్వ్ చేయని మహిళల కంపార్ట్ మెంట్ లోకి  ఓవ్యక్తి చోరీకి వచ్చాడు. దొంగ బ్యాగు లాక్కోవడంతో  ఆ మహిళ ప్రతిఘటించింది. దీంతో దొంగ  ఆమెను కంపార్ట్ మెంట్ నుంచి తోసేసి పారిపోయాడు. బాధితురాలి ఎవరు ఆమె పరిస్థితి ఎలా ఉందనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు.
 
అయితే ఆ మహిళ సోమవారం ప్రభుత్వ రైల్వే పోలీసులను (జిఆర్‌పి) సంప్రదించి కంప్టైంట్ చేసినట్లు అధికారి తెలిపారు.  మహిళ కంప్టైంట్ చేయకముందే  సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు. ముంబైలో రైలులో  ప్రయాణికులపై  దాడి జరగడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి.