చత్తీస్​గఢ్​లోఎన్​కౌంటర్​ముగ్గురు మావోయిస్టులు హతం

చత్తీస్​గఢ్​లోఎన్​కౌంటర్​ముగ్గురు మావోయిస్టులు హతం

భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​రాష్ట్రంలోని కాంకేర్​ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఎస్పీ కల్యాణ్​ఎలెసెలా కథనం ప్రకారం...జిల్లాలోని కోయలీబేడా పోలీస్​స్టేషన్​పరిధిలోని హురత్​రాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారు. పక్కా సమాచారంతో రిజర్వ్ గార్డ్స్, బీఎస్ఎఫ్​ జవాన్లు కూంబింగ్​కు వెళ్లారు.

వీరి రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. జవాన్లు కూడా ఎదురుకాల్పులకు దిగారు. సుమారు రెండు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరగ్గా మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. తర్వాత సంఘటనా స్థలంలో చూడగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. రెండు తుపాకులతో పాటు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు.

ప్రెషర్ బాంబు పేలి సీఏఎఫ్​ జవాను దుర్మరణం

భద్రాచలం : చత్తీస్​గఢ్​రాష్ట్రంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఆదివారం ఓ జవాను చనిపోయాడు. బీజాపూర్​ఎస్పీ జితేంద్రయాదవ్​ కథనం ప్రకారం...జిల్లాలోని మిర్తూర్​పోలీస్​స్టేషన్​ పరిధిలోని బేఛాపాల్​అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సీఏఎఫ్​( చత్తీస్​గఢ్​ ఆర్ముడ్​ఫోర్స్) బలగాలు కూంబింగ్​కు వెళ్లాయి. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్​ బాంబుపై ఆశిష్​యాదవ్​అనే జవాన్​కాలు మోపడంలో అది పేలింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన జవాన్లను సురక్షితంగా అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చినట్లు ఎస్పీ జితేంద్రయాదవ్​తెలిపారు.