బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ది: కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల

బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ది: కేంద్రమంత్రి  పురుషోత్తం రూపాల

9ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని కేంద్ర పశు సంవర్థ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు.  తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయిల నిధులు మంజూరు చేసిందన్నారు.  తెలంగాణ అభివృద్ది చెందాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. చెన్నూరులో ఏర్పాటు చేసిన మహాసంపర్క్ సభలో ఆయన పాల్గొన్నారు. 2014 కంటే ముందు దేశంలో అవినీతి తావడవించిందన్న పురుషోత్తం. ..మోడీ. ప్రధాని  అయిన తరువాత పశువుల అభివృద్దికి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు.   పశువుల కోసం దేశంలో 4 వేల అంబులెన్స్ లను కేంద్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసిందన్నారు.  

దేశవ్యాప్తంగా 200 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ప్రధాని మోడీ ఇచ్చారన్నారు. రైతులకు 18 లక్షల కోట్ల రుణాలను ఇచ్చిన మోడీ.. మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చామన్నారు.   ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న కాశ్మీర్ , ఆర్టికల్ 370 సమస్యలను ప్రధాని మోడీ పరిష్కరించారని కేంద్ర పశుసంవర్థక శాఖా మంత్రి పురుషోత్తం తెలిపారు.  గత ప్రభుత్వంలో కాశ్మీర్ లో కర్ఫ్యూ లేని  రోజు ఉండేది కాదని... కాని బీజేపీ హయాంలో  అక్కడి ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో జీవిస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు. మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ది చెందిందన్నారు.