కరోనాతో గాంధీ మునిమనవడు మృతి

కరోనాతో గాంధీ మునిమనవడు మృతి

కరోనాతో మహాత్మా గాంధీ మనవడు సతీష్ ధుపేలియా (66) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన  నెల రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమయంలోనే ఆయనకు  కరోనా వచ్చింది. మూడు రోజుల క్రితమే పుట్టిన రోజు జరుపుకున్న దుపేలియా  ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో సౌతాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ లో మరణించారు. ఈ విషయాన్నిఆయన సోదరి ఉమా ధుపెలియా-మెస్త్రీ వెల్లడించారు. సతీష్ దుపేలియా ఎక్కవగా మీడియా రంగంలో పనిచేశారు. వీడియో,ఫోటో గ్రాఫర్ గా పనిచేశాడు.