నిర్భయంగా ఓటు హక్కు  వినియోగించుకోవాలి : ఎస్పీ సుధీర్​ రాంనాధ్​ కేకన్​

నిర్భయంగా ఓటు హక్కు  వినియోగించుకోవాలి : ఎస్పీ సుధీర్​ రాంనాధ్​ కేకన్​

కొత్తగూడ,వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల్లో ప్రజలంతా  నిర్భయంగా ఓటు హక్కు  వినియోగించుకోవాలని మహబూబాబాద్​ ఎస్పీ సుధీర్​ రాంనాధ్​ కేకన్​ అన్నారు. శనివారం  కొత్తగూడ,గంగారం మండల కేంద్రాల్లో  సీఆర్​పిఎఫ్​,సివిల్​ పోలీసులతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో  అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు.

అనంతరం  మావోయిస్టుల ఆచూకీ తెలిపితే  రివార్డులు  ఉంటాయని, వాల్​ పోస్టర్​ను ఆవిష్కరించారు.  మావోల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.  వారి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం తిరుమల గండిలో యువకులతో క్రికెట్​ ఆడి ఉత్తేజాన్ని నింపారు.ఆయన వెంట డీఎస్పీ తిరుపతిరావు,గూడూరు  సీఐ బాబురావు, కొత్తగూడ, గంగారం ఎస్పైలు దీలీప్​, రవికుమార్​  ఉన్నారు.