మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో హ్య‌ట్రిక్ సినిమా

మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో  హ్య‌ట్రిక్  సినిమా
  • మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా
  • నమ్రత చేతులమీదుగా మహేశ్ మూవీ ప్రారంభం

ప్రిన్స్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు, ఖలేజా’ సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో తెలిసిందే. వీరి కాంబినేషన్ లోని మూడో సినిమా వస్తుండగా.. గతేడాది మే 1న ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. అయితే  మహేశ్ ‘సర్కారువారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభమైంది.  SSMB 28గా పిలుచుకుంటున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ హాజరయ్యారు.  హీరోయిన్ పూజాహెగ్డేపై నమ్రత క్లాప్ కొట్టి సినిమాను లాంఛ్ చేసింది. నమ్రత పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ, ఆర్ట్ డైరెక్టర్ ఏ.యస్.ప్రకాశ్, టెక్నికల్ టీమ్ హాజరయ్యారు. మార్చ్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపింది సినిమా యూనిట్. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంది.