- ఈ గెలుపు ప్రతి కార్యకర్తకు అంకితం: మహేశ్ కుమార్ గౌడ్
- ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదన్న పీసీసీ చీఫ్
నిజామాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. రెండేండ్ల ప్రజాపాలనపై సంతృప్తిగా ఉన్నట్టు రిజల్ట్స్తో స్పష్టం చేశారన్నారు. ఉప ఎన్నికలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గెలుపు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు ఇవ్వని ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పూర్తిగా సెలవు చెప్పారన్నారు.
బీఆర్ఎస్ ఇక గతమని.. ఆ పార్టీకి భవిష్యత్లేదన్నారు. బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటున్న బీజేపీకి కూడా సరైన బుద్ధి చెప్పారన్నారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ప్రజలు నమ్మారన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తం
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి శ్రద్ధ పెట్టారని, సెకెండ్ ఫేజ్ మెట్రో, మూసీ సుందరీకరణకు ప్రజలు మద్దతిచ్చారని మహేశ్ గౌడ్ అన్నారు. గతంలో కంటోన్మెంట్, జూబ్లీహిల్స్గెలుపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయమని ఖాయమని ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. ప్రజా మద్ధతు కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్ పదవికి కేటీఆర్ రిజైన్చేయాలని, బండి సంజయ్ గుండు కొట్టించుకోవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
ఈ ఎన్నిక రెండేళ్ల పాలనకు రెఫరెండం అన్న కేటీఆర్, సంజయ్ ఫలితాల తర్వాత మాట మార్చారన్నారు. జూబ్లీహిల్స్ విజయం మహేశ్ గౌడ్ నాయకత్వానికి నిదర్శనమని పేర్కొంటూ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ఆయన్ను సన్మానించారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
