
హైదరాబాద్, వెలుగు: ఎన్ని కుట్రలు చేసినా 17న హైదరాబాద్లోనే బహిరంగ సభ నిర్వహిస్తామని పీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా సోనియా, మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వస్తున్నారని తెలిపారు.17న సభ నిర్వహించాలనుకుంటే పరేడ్ గ్రౌండ్ను ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
అమిత్ షా సభను కావా లనే వరంగల్ నుంచి పరేడ్ గ్రౌండ్కు మార్చారని ఆరోపించారు. తాము పరేడ్ గ్రౌండ్ కోసం దరఖాస్తు చేసుకున్నా మని.. కానీ, అదే రోజు సభ కోసం బీజేపీ అప్లికేషన్ పెట్టుకుందని వివరించారు. ఎల్బీ స్టేడియం కోసం కూడా అప్లై చేశామని, అది కూడా ఇస్తారో లేదో ఇంకా క్లారిటీ రాలేదని చెప్పారు.