ఎన్ని కుట్రలు చేసినా .. హైదరాబాద్​లోనే సభ నిర్వహిస్తం: మహేశ్​ కుమార్

ఎన్ని కుట్రలు చేసినా ..  హైదరాబాద్​లోనే  సభ నిర్వహిస్తం: మహేశ్​ కుమార్

హైదరాబాద్, వెలుగు: ఎన్ని కుట్రలు చేసినా 17న హైదరాబాద్​లోనే బహిరంగ సభ నిర్వహిస్తామని పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్ ​మహేశ్ కుమార్​ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో ఏఐసీసీ సెక్రటరీ సంపత్​ కుమార్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా సోనియా, మల్లికార్జున ఖర్గే హైదరాబాద్​కు వస్తున్నారని తెలిపారు.17న సభ నిర్వహించాలనుకుంటే పరేడ్​ గ్రౌండ్​ను ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

అమిత్​ షా సభను కావా లనే వరంగల్ ​నుంచి పరేడ్​ గ్రౌండ్​కు మార్చారని ఆరోపించారు. తాము పరేడ్​ గ్రౌండ్ ​కోసం దరఖాస్తు చేసుకున్నా మని.. కానీ, అదే రోజు సభ కోసం బీజేపీ అప్లికేషన్​ పెట్టుకుందని వివరించారు. ఎల్బీ స్టేడియం కోసం కూడా అప్లై చేశామని, అది కూడా ఇస్తారో లేదో ఇంకా క్లారిటీ రాలేదని చెప్పారు.