మహేష్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫిక్స్!

మహేష్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫిక్స్!

మహేష్‌‌ బాబుకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి బజ్ నడుస్తూనే ఉంటుంది. రెండు సినిమాలు లైన్‌‌లో ఉండటంతో వాటి గురించిన చర్చే నడుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌‌లో నటిస్తున్నాడు మహేష్. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు బైటికొచ్చాయి. ఈ చిత్రానికి ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్‌‌ డిసైడ్ చేశారట.

త్రివిక్రమ్‌‌కు ‘అ’ సెంటిమెంట్‌‌ ఉంది. అతడు, అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలే అందుకు ఉదాహరణ. ఈసారి కూడా అదే అక్షరం ఉండాలని ఈ టైటిల్‌‌ని ఫిక్స్ చేశాడంటున్నారు. పూర్తిగా త్రివిక్రమ్ మార్క్‌‌తో ఉండే ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో మహేష్‌‌ సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్‌‌‌‌గా కనిపిస్తాడనేది మరో వార్త. హీరోయిన్‌‌గా పూజా హెగ్డే నటిస్తోంది. అనన్యా పాండే ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందని, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. సెకెండ్ షెడ్యూల్ నిన్న మొదలవ్వాల్సి ఉన్నా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల లేటయ్యింది. ఇక నెక్స్ట్ రాజమౌళి డైరెక్షన్‌‌లో ఓ అడ్వెంచరస్ ఫిల్మ్ చేయనున్నాడు మహేష్. ఇందులో విక్రమ్ విలన్‌‌గా నటిస్తాడనే న్యూస్ ఆమధ్య చక్కర్లు కొట్టింది. ఇప్పుడు అతని స్థానంలోకి కార్తి పేరు వచ్చింది. ఒక బాలీవుడ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపిస్తాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా వట్టి ప్రచారమేనా లేక వీటిలో నిజాలేమైనా ఉన్నాయా అనేది ఆ టీమ్స్‌‌ కన్‌‌ఫర్మ్ చేస్తే కానీ తెలియదు.