10న రాజ్ భవన్ లో మహిళా దర్బార్

10న  రాజ్ భవన్ లో మహిళా దర్బార్

గవర్నర్ తమిళిసై  జూన్ 10న మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. తాను ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా దీన్ని  శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్ భవన్ లో నిర్వహించనున్నారు. గవర్నర్‌ను వచ్చి కలవాలనుకునే మహిళలు 040 - 23310521కు  కాల్ చేయడం ద్వారా లేదా  rajbhavan-hyd@gov.inకు ఈమెయిల్ చేయడం ద్వారా అపాయింట్‌మెంట్ పొందొచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే రాజ్ భవన్ ఉందని, నెలకోసారి ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని  గవర్నర్ తమిళి సై  ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు గవర్నర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.