గవర్నర్ తమిళిసై జూన్ 10న మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. తాను ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా దీన్ని శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్ భవన్ లో నిర్వహించనున్నారు. గవర్నర్ను వచ్చి కలవాలనుకునే మహిళలు 040 - 23310521కు కాల్ చేయడం ద్వారా లేదా rajbhavan-hyd@gov.inకు ఈమెయిల్ చేయడం ద్వారా అపాయింట్మెంట్ పొందొచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే రాజ్ భవన్ ఉందని, నెలకోసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని గవర్నర్ తమిళి సై ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు గవర్నర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.