మహిపాల్ రెడ్డి బ్యాంకు లాకర్లలో సోదాలు

మహిపాల్ రెడ్డి బ్యాంకు లాకర్లలో సోదాలు
  •     రెండు గంటల పాటు ఈడీ తనిఖీలు
  •     బినామీ డాక్యుమెంట్లు స్వాధీనం!

సంగారెడ్డి, వెలుగు: పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బ్యాంకు లాకర్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రమాలు, బినామీ వ్యాపారాలు, నిధుల మళ్లింపునకు సంబంధించి మహిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని ఈడీ విచారిస్తున్నది. బుధవారం పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు యాక్సిస్ బ్యాంకులో మహిపాల్ రెడ్డికి సంబంధించిన లాకర్లను అధికారులు ఓపెన్ చేయించి తనిఖీ చేశారు. 

సుమారు రెండు గంటల పాటు లాకర్లలో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించారు. అవి బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. కాగా, జూన్ 20న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు, బంధువుల ఇండ్లల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆ టైమ్​లో పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకొని విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.

 ఈ నేపథ్యంలో మంగళవారం ఈడీ ఆఫీసులో మహిపాల్ రెడ్డి.. విచారణకు హాజరు కాగా.. బుధవారం బ్యాంకు లావాదేవీలు, లాకర్లపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే.. మహిపాల్ రెడ్డికి బినామీలుగా ఉన్న వారంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నది.