ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన బిల్డింగ్ లోని ఒక భాగం

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన బిల్డింగ్ లోని ఒక భాగం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. కబీర్ నగర్ లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లోని ఒక భాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో బిల్డింగ్ లో ముగ్గురు కార్మికులు పనులు చేస్తున్నారు. దీంతో ఇద్దరు స్పాట్ లోనే చనిపోగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న  పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

 గాయపడిన కార్మికుడిని స్థానిక జీటీబీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందినవారు అర్షద్, తౌహీద్ లు గా గుర్తించారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. భవనం ఎలా కూలిందన్న కోణంలో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.