శబరిమలలో మకర జ్యోతి దర్శనమైంది. పొన్నాంబలమేరు కొండపై మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇచ్చింది. దాంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు. శరణం అయ్యప్పా అంటూ శరణు ఘోష చేశారు. ఈసారి కరోనా ప్రభావంతో తక్కువ మంది భక్తులనే కొండపైకి అనుమతించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులకు దర్శనాలు కల్పించారు ఆలయ నిర్వాహకులు.