ఫార్మా సిటీ పనులు ఫాస్ట్‌‌‌‌‌‌‌‌గా చేయండి

ఫార్మా సిటీ పనులు ఫాస్ట్‌‌‌‌‌‌‌‌గా చేయండి

కేంద్రమంత్రి పీయూష్​ గోయల్‌‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచన
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై చర్చ 

న్యూఢిల్లీ, వెలుగు:తెలంగాణలో ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫార్మా సిటీ పనులను వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్​ గోయల్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి భవన్ లో కేంద్ర మంత్రితో పాటు వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీలో ప్రతిపాదించిన ప్రాజెక్టులపై చర్చించారు.  హైదరాబాద్–-వరంగల్, హైదరాబాద్–-నాగ్‌‌‌‌‌‌‌‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లు, రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీ ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులను గడువులోగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల విషయంలో ఎదురవుతున్న సమస్యలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీకి సంబంధించి విశాఖ––చిత్తూరు ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడలో ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌‌‌‌‌‌‌‌టీ)లపై సమావేశంలో చర్చించారు. గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ఆ జిల్లాలో స్పైస్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తల కోసం