
- షాద్నగర్ టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొట్టిన మరో వెహికల్
- ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ ఎమ్మెల్యే శ్రీహరి
షాద్నగర్, వెలుగు : మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి శుక్రవారం ప్రమాదం తప్పింది. మహబూబ్నగర్ కలెక్టరేట్లో జరిగే మీటింగ్కు హాజరయ్యేందుకు ఎమ్మెల్యే శ్రీహరి హైదరాబాద్ నుంచి తన వాహనంలో బయలుదేరారు. షాద్నగర్ టోల్గేట్ సమీపంలోకి రాగానే ఎమ్మెల్యే వాహనాన్ని మరో వెహికల్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఎమ్మెల్యే వెహికల్ ముందు భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబ్నగర్ కలెక్టరేట్కు వెళ్లిపోయారు.