మాలిలో ఉగ్రదాడి.. 31మంది మృతి

మాలిలో ఉగ్రదాడి.. 31మంది మృతి

ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారు. ఈ ఘటన ఆఫ్రికా దేశం మాలిలో చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది సామాన్య పౌరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. బండియగర పట్టణ సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది.  సుమారు 50 మంది పౌరులతో వెళ్తున్న ట్రక్కుపై అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రక్కులో మంటలు చెలరేగి 31 మంది చనిపోయారు. 

వీరిలో ఎక్కువమంది సజీవ దహనమైనట్లు బండియగర మేయర్‌ హొస్సేనీ తెలిపారు. పలువురు గాయాలపాలయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. స్థానిక సాయుధ బృందాల హింసాత్మక చర్యల కారణంగా మాలిలో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ , ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పరిస్థితి ఆందోళన కరంగా మారింఇ. ఈ దుర్గటనలో సజీవదహనం అయిన 25 మంది మృతదేహాలను గుర్తించారు.