టీఆర్ఎస్ దాడికి నిరసనగా రేపు మల్కాజిగిరి బంద్

 టీఆర్ఎస్ దాడికి నిరసనగా రేపు మల్కాజిగిరి బంద్

సికింద్రాబాద్: బీజేపీ కార్పొరేటర్ పై దాడికి నిరసనగా రేపు సోమవారం బంద్ పాటించాలని మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ప్రకటించారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు బంద్ కు పిలుపునివ్వడం జరుగుతోందని ఆయన తెలిపారు.  ప్రతి ఒక్కరూ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడికి నిరసనగా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని టీఆర్ఎస్ గూండాల ఆగడాలకు బుద్ధి చెప్పాలని రామచందర్ రావు కోరారు.