మైనర్ పై రెండేండ్లుగా ఏఎస్సై అత్యాచారం

మైనర్ పై రెండేండ్లుగా ఏఎస్సై అత్యాచారం

మైనర్ పై అత్యాచారానికి పాల్పడుతున్న రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ ​ ఏఎస్సైని మల్కాజిగిరి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆనంద్ బాగ్ లో ఉండే తన్ కచన్ లాలూ అలియాస్ సెబాస్టియన్ (44) ఆర్పీఎస్ఎఫ్ లో ఏఎస్సైగా పనిచేస్తున్నాడు. రెండేండ్లుగా ఓ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడుతూ.. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ నెల 6న బాధిత యువతి తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు కంప్లయింట్ చేసింది. మల్కాజిగిరి పోలీసులు సెబాస్టియన్ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నిందితునిపై ముషీరాబాద్ పోలిస్స్టేషన్ పరిధిలో 2017లో ఓ మర్డర్ కేసు కూడా ఉందని, ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ట్రయల్ నడుస్తుందని ఏసీపి శ్యాం ప్రసాద్ చెప్పారు.

బైక్ ను ఢీ కొట్టిన లారీ..యువకుడు మృతి