రెండేళ్లుగా రైతుబంధు వస్తలేదు

రెండేళ్లుగా రైతుబంధు వస్తలేదు

 కలెక్టర్​కు మల్కాపూర్​ రైతుల ఫిర్యాదు
 15 రోజుల్లో సర్వే చేయించాలని వినతి
 న్యాయం చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక

నిర్మల్‍, వెలుగు: రెండేళ్లుగా తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతుబంధు స్కీమ్​కింద డబ్బులు రావడం లేదని, ఈ నెల15 లోగా సర్వే చేసి.. తమకు న్యాయం చేయకుంటే కలెక్టరేట్​దగ్గర ఆత్మహత్య చేసుకుంటామని  మల్కాపూర్​ రైతులు హెచ్చరించారు. గురువారం రైతులు నిర్మల్​కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కేంద్రప్రభుత్వం నుంచిసాయం అందుతున్నా..  రైతుబంధు రావడం లేదన్నారు. నిర్మల్‍ జిల్లాలోని లోకేశ్వరం మండలం మల్కాపూర్​శివారులో 25 ఏండ్ల కింద 148 సర్వే నంబర్‍లో  రైతులకు భూములు అసైన్​చేశారు. రెండేళ్ల కింద ఎంజాయ్​మెంట్​సర్వే తర్వాత ఈ సర్వే నంబర్‍లోని 520  ఎకరాలకు రైతుబంధు సాయం ఆగిపోయింది. సర్వే చేసే సమయంలో ఈ భూములకు సంబంధించిన వివరాలు ఆన్‍లైన్‍లో నుంచి తొలగించారు. తర్వాత అర్హులను గుర్తించి పట్టాపాస్‍బుక్​లు అందించినా  ఆన్‍లైన్‍లో సైన్‍ఇన్ కాలేదు. దీంతో  రైతుబంధుతోపాటు క్రాప్‍లోన్లు, ఇతర స్కీంలు అందడం లేదు. ధరణి వెబ్‍సైట్‍లో ఈ సర్వేకు సంబంధించిన భూములే కాదు.. సర్వే నంబర్​ కూడా మీ సేవ ఆఫీసులో సైన్‍ఇన్‍ ఆప్షన్‍ లేకపోవడంతో ఏడాది నుంచి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్డీవోను పంపించి  ఎంజాయిమెంట్‍ సర్వే చేయిస్తామని కలెక్టర్​ హామీ ఇచ్చారని,  15 రోజులు చూసి తాము ఆందోళన బాట పడతామని హెచ్చరించారు.