చిరుమర్తి లింగయ్యకు చేదు అనుభవం..

  చిరుమర్తి లింగయ్యకు చేదు అనుభవం..

బీఆర్ఎస్ నేత, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు చేదు అనుభవం ఎదురైంది. కట్టంగూర్ మండలంలోని మల్లారం గ్రామంలో  రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు, 30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన 2023 జూన్ 11 ఆదివారం రోజున శంకుస్థాపన చేశారు.  

అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో  గ్రామస్థులు ఎమ్మెల్యేను నిలదీశారు.   తమ ఊరికి ఏం నిధులు ఇచ్చావని, తమ ఊరిని ఏం డెవలప్ చేసావ్ అని ప్రశ్ని్ంచారు.  దీంతో చేసేది ఏమీ లేక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అక్కడినుంచి వెనుదిరిగారు.