మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పీఏ నంటూ డబ్బులు వసూలు చేసిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. మల్లారెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న జ్యోతి స్వరూప్ ఫిర్జాదిగూడ కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి దగ్గర రూ. 10.లక్షలు వసూలు చేశాడు.
తీరా టికెట్ ఇప్పించకపోవడం, తన డబ్బులు తనకు ఇవ్వాలంటే తప్పించుకుని తిరగడంతో జ్యోతి స్వరూప్ పై 2019లో బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కేసును విచారించి 3 ఏళ్ల జైల శిక్ష విధించింది.
ALSO READ : నారాయణపేట మున్సిపాలిటీలో లుకలుకలు