హుజూర్ నగర్ లో TRSకు కాంగ్రెస్ కే పోటీ: భట్టి

హుజూర్ నగర్ లో TRSకు కాంగ్రెస్ కే పోటీ: భట్టి

హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క. ప్రజాస్వామ్య వాదులు కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.  హుజూర్ నగర్ లో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త సింహం లాగ పనిచేయాలన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం హుజూర్ నగర్ లో ప్రచారానికి తాము కూడా ప్రచారానికి వెళ్తామన్నారు.  బీజేపీని పరిగణలోకి తీసుకోబోమని..టీఆర్ ఎస్ కు తమకే ప్రధాన పోటీ అన్నారు.
ప్రభుత్వం భయ బ్రాంతులకు గురి చేసి గెలవాలని చూస్తుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరపాలని ఎన్నికల అధికారికి కూడా లేఖ రాస్తామన్నారు. అధికారులు ఏకపక్షంగా పని చేయాలని చూస్తే సహించబోమన్నారు.