కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. వారం రోజుల క్రితమే తన రాజీనామా లేఖను సీఎం రేవంత్రెడ్డికి పంపించినట్లుగా తెలిపారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకే పదవికి రాజీనామా చేసినట్లుగా మల్లు రవి స్పష్టం చేశారు.
ఎంపీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ బరిలో నిలబడతున్నట్లుగా మల్లు రవి తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి 28న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు మల్లు రవి. నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కోసం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్, మల్లు రవి మధ్య పోటీ ఉంది. కాగా ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.