సీఎం రేవంత్​ సొంత లాభం కోసం ఢిల్లీకి పోవట్లే

సీఎం రేవంత్​ సొంత లాభం కోసం ఢిల్లీకి పోవట్లే
  •     పెండింగ్ నిధుల కోసం ప్రయత్నిస్తున్నరు: మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లడం లేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులను క్లియర్​ చేయడానికి, పెండింగ్​ నిధులను తీసుకురావడానికే రేవంత్ ఢిల్లీకి  వెళ్తున్నారని చెప్పారు.  

రేవంత్ ను ఢిల్లీకి సబ్ సర్వెంట్ అంటూ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అనడం సరికాదని తెలిపారు. ఆదివారం మల్లు రవి ఈ మేరకు ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ప్రభాకర్ ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని సీఎం రేవంత్ కు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  

పదేండ్లపాటు రాష్ట్రంలో కేసీఆర్​ ఏ పనులూ చేయలేదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తేలేదని మల్లు రవి విమర్శించారు. నిధుల లేమితో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయని పేర్కొన్నారు. అన్ని శాఖల మంత్రులతో సీఎం రేవంత్​ భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మల్లు రవి వెల్లడించారు. బండి సంజయ్​అబద్ధాలకు బ్రాండ్​అంబాసిడర్​లా మరారని విమర్శించారు.  గోబెల్స్ కు వారసుడిలా ఆయన తీరుందని మండిపడ్డారు.