కొత్త మోటార్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు వాహానదారుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానాల మోత మోగిస్తున్నారు. ఢిల్లీలోని షేక్ సరాయి ఏరియాలో టూ వీలర్ నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఓ వ్యక్తికి పోలీసులు ఫైన్ విధించారు. ఆ చలానా మొత్తాన్ని చూసి షాకైన ఆ వ్యక్తి.. కోపంతో తన బైక్ ను నడిరోడ్డు మీద తగులబెట్టాడు. అక్కడే ఉన్న స్థానికులు ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. తాగిన మత్తులోనే ఆ బైకర్ తన బైక్ ను తగులబెట్టుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.