కేటి దొడ్డి, వెలుగు: బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తిని అరెస్ట్చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. కేటిదొడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను గార్లపాడుకు చెందిన తెలుగు ఆంజనేయులు మాయమాటలు చెప్పి, కిడ్నాప్చేసి, పెళ్లి చేసుకున్నాడన్నారు.
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి, మంగళవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
