V6 News

పద్మారావునగర్ లో గొడవ పడి.. స్నేహితుడిపై బండరాయితో దాడి..బాధితుడి తలకు తీవ్ర గాయాలు

పద్మారావునగర్ లో గొడవ పడి.. స్నేహితుడిపై బండరాయితో దాడి..బాధితుడి తలకు తీవ్ర గాయాలు

పద్మారావునగర్, వెలుగు: గొడవను మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి తన స్నేహితుడిపై బండరాయితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన జె.సుమన్​, రాజు యాదవ్, శ్యాం, శ్రీను, ఉపేందర్ స్నేహితులు. వీరు ఈ నెల 8న రాత్రి 11.30 గంటలకు రాంనగర్​లోని ఓ మండిలో బిర్యానీ తినడానికి వెళ్లారు. తింటున్న సమయంలో సుమన్​, రాజు యాదవ్ మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. సుమన్​పై కక్ష పెంచుకున్న రాజు యాదవ్​మంగళవారం ఉదయం 7 గంటలకు వారాసిగూడలోని ఎల్.ఎన్. నగర్​లో ఉండే అతని ఇంటికి వెళ్లాడు.

నిద్రిస్తున్న సుమన్ పై బండరాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు సుమన్ ను వెంటనే సికింద్రాబాద్​గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు నిమ్స్ కు తీసుకెళ్లారు. నిందితుడు రాజు యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.