ఓ ఇద్దరు దంపతులు కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అక్కడ నదిలో స్నానం చేస్తుండగా భర్త తన భార్యకు మద్దుపెట్టుకున్నాడు. అయితే అక్కడే ఉన్న కొందరు దీనిని గమనించి ఇదేం పద్దతంటూ తిట్టారు. అంతంటితో ఆగకుండా చేయిచేసుకున్నారు కూడా. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే భర్తను కొడుతుంటే పాపం అతని భార్య రక్షించడానికి ప్రయత్ని్ంచింది కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. అప్పటికే చాలామంది అతన్ని చుట్టుముట్టడంతో ఆమె కూడా ఏం చేయలేకపోతుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు అయోధ్య పోలీసులను కోరారు. గంగా నది ఏడు ఉపనదులలో సరయు నది ఒకటి. దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. రాముడి జన్మస్థలమైన అయోధ్య,, సరయు నది ఒడ్డున ఉంది.
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022