వినాయక విగ్రహాలను చూసేందుకు వచ్చి విగత జీవిగా మారాడు

వినాయక విగ్రహాలను చూసేందుకు వచ్చి విగత జీవిగా మారాడు

మెదక్ టౌన్, వెలుగు : వినాయకులను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి  అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్​ పట్టణంలో జరిగింది. మెదక్​ టౌన్​ సీఐ వెంకటేశ్  తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని హవేళీ ఘనపూర్​ మండలం పోచమ్మరాల్​ తండాకు చెందిన మూడ్​ సంతోష్​ (25) శుక్రవారం రాత్రి మెదక్​ పట్టణంలో వినాయకులను చూసేందుకు వెళ్తున్నానని భార్య సరస్వతి, కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం శనివారం ఉదయం మెదక్​లోని ఫతేనగర్​ ఏపీజీవీబీ బ్యాంకు వద్ద అతను అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు.

ఈ విషయాన్ని పోలీసులు మృతుడు సంతోష్​  భార్య సరస్వతికి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొన్న సరస్వతి.. తన భర్త మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెదక్​ టౌన్​ పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్​  జిల్లా ఆసుపత్రికి తరలించారు.