సాంగ్స్ వింటూ డ్రైవ్.. ప్రమాదంలో వ్యక్తి మృతి

సాంగ్స్ వింటూ డ్రైవ్.. ప్రమాదంలో వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లా: నిర్లక్ష్యం అతడి ప్రాణం తీసింది. హెల్మెట్ లేదు.. పైగా మొబైల్ లో సాంగ్స్ వింటూ యాక్టీవాపై అజాగ్రత్తగా డ్రైవ్ చేయడంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజేంద్రనగర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ వద్ద బుధవారం మధ్యాహ్నం డీసీఎం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాజేంద్రనగర్ నుండి హిమాయత్ సాగర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి హెల్మెట్ సరిగ్గా ధరించక పోవడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు తెలిపిన  పోలీసులు.. సెల్ ఫోన్ లో సాంగ్స్ వింటూ యాక్టీవాపై అజాగ్రత్తగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రాజేంద్రనగర్ పోలీసులు. రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో..  ట్రాఫిక్ ను క్లీయర్ చేశామని చెప్పారు పోలీసులు. మొబైల్ ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు.