సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు రకరకాల ఫీట్స్ చేస్తున్నారు జనాలు. అవి వైరల్ అయితే లైక్స్, కామెంట్స్ వస్తాయని ఎలాంటి వీడియోనైనా చేయడానికి వెనుకాడడం లేదు. ప్రాణాలకు తెగించి మరి కొన్ని వీడియోలు, కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని ఎమోషనల్ వీడియోలు ఇలా రకరకాలుగా వ్యూవర్స్ ను ఆకట్టుకుంటున్నారు.
సోషల్ మీడియా అంటే ఒక వ్యక్తి కొన్ని రోజుల్లోనే చాలా పాపులర్ అయ్యి సెలబ్రిటీ అవుతాడు. రాత్రికి రాత్రే చాలా మంది ఇంటర్నెట్ సెన్సేషన్ అయినవారు కూడా ఉన్నారు. దీని కోసం కొందరు ఇలాంటి పనులు చేసినా.. ఎవరూ ఆలోచించరు. అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పచ్చి మిరపకాయలను కూరల్లో మూడో నాలుగో టేస్ట్ కోసం వాడతారు. స్పైసీగా ఉండాలంటే మరో రెండు వేస్తారు. కూర వండేటప్పుడు దానితో పాటు వేయిస్తారు. తినేటప్పుడు వాటిని కొంతమంది పక్కనపెట్టి తింటారు. మరికొంతమంది కొద్ది్ కొద్దిగా కొరుకుతూ తింటారు. అయితే ఇప్పుడు ఓ యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయి లైక్ లు సాధించేందుకు పచ్చి మిరపకాయలను చాక్లెట్లను నమిలినట్టు నమిలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆయన పచ్చి మిరపకాయలు తింటుంటే.. ఆయన కళ్లలోనుంచి నీరు కారుతున్నట్లు వీడియోలో ఉంది. సోషల్ మీడియా యూజర్స్ అతని సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. మరికొంతమంది అతనిపై జాలి చూపిస్తూ కామెంట్లు పెట్టారు. అతను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పచ్చిమిరపకాయల గుత్తిని నములుతున్న వీడియోను పోస్ట్ చేశాడు. క్షణికావేశంలో ఒళ్లు జలదరిస్తూ మిరపకాయలన్నీ తింటాడు. అతను పోస్ట్ చేసిన పలు వీడియోలను కోట్లమంది వీక్షించారు. ఈ వీడియో అయితే rintu2_bhAi అనే ఇన్స్టాగ్రామ్ IDతో షేర్ చేశారు. దీనిని 13 మిలియన్లకు పైగా అంటే 1.3 కోట్ల మంది వీక్షించారు. 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ, కేవలం లైక్ల కోసం ఎవరైనా తనను తాను బాధపెట్టుకోవద్దని రాశారు. అదే సమయంలో, చాలా మంది అతనికి అలా చేయవద్దని సలహా ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ఓ భాగం అయిపోయింది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరూ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియాకు ఒక్కసారిగా క్రేజ్ పెరగడంతో దానిని ఉపయోగించుకుని పాపులర్ అయ్యేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.