
చెల్లెలిని వేధిస్తున్నాడని బావను తండ్రితో కలిసి దారుణంగా హతమార్చిని బావమరిదిని దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్ట్చేశారు. సీఐ వెంకటేషంతో కలిసి పేట్బషీరాబాద్ ఏసీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐడీపీఎల్కాలనీ గురుమూర్తినగర్కు చెందిన షేక్ అమీర్(25) గాజులరామారం కైసర్నగర్కు చెందిన మరూఫ్పటేల్ కుమార్తె హీనా బేగంను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడు నెలల కుమార్తె ఉంది. 15 రోజుల క్రితం చిన్నారికి జ్వరం రావడంతో తన కుమార్తెను తీసుకొని హీనా పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 11న వాళ్లను చూడడానికి కైసర్నగర్లోని అత్తగారింటికి అమీర్వెళ్లాడు. భార్యా భర్తల మధ్య జరిగిన గొడవతో కోపోద్రిక్తుడైన హీనా సోదరుడు ఇస్మాయిల్తన తండ్రితో షేక్మరూఫ్పటేల్తో కలిసి డంబెల్స్తో దాడి చేశాడు. అమీర్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందులను ప్రగతినగర్ క్రాస్రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఏటీఎం చోరీ కేసులో…
ఏటీఎం సెంటర్లో చోరీ చేసేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భౌరంపేట్కు చెందిన ఎండీ షాకీర్(30) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. సంగారెడ్డి రామ్నగర్కు చెందిన రమేష్ కుమారుడు సాయి విక్రమ్(23) సెంట్రింగ్ పనిచేస్తుంటాడు. వీరిద్దరు ఈ నెల 12న వేకువజామున 2.30 గంటల సమయంలో మద్యం తాగి సూరారంలోని ఓం జెండా వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్లారు. రాడ్డు, స్క్రూ డ్రైవర్తో క్యాష్ కవర్ను ధ్వంసం చేశారు. అక్కడ జనాలను చూసి కొద్ది దూరంలో ఉన్న బీఓఐ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లి అందులో క్యాష్ కవర్ను ధ్వంసం చేసి డబ్బులు దొంగలించేందుకు యత్నించారు. అటువైపు వస్తున్న వారిని చూసి అక్కడినుండి పరారయ్యారు. దుండిగల్ పెట్రోలింగ్ సిబ్బంది సూరారం క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా షాకీర్, సాయి విక్రమ్పట్టుబడ్డారని ఏసీపీ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఐ శంకర్రెడ్డి ఉన్నారు.