- నిమజ్జనం కోసం వెళ్లిన 20 మంది యువకులు
- బీచుపల్లి సమీపంలో స్నానం చేస్తుండగా ప్రమాదం
గద్వాల, వెలుగు : వినాయకుడి నిమజ్జనం కోసం హైదరాబాద్ నుంచి గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి కృష్ణానదికి వెళ్లిన ఓ యువకుడు కొట్టుకుపోయి చనిపోయాడు. ఎస్ఐ గోకారి కథనం ప్రకారం..హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన 20 మంది యువకులు సోమవారం వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు డీసీఎంలో బీచుపల్లి కృష్ణా నదికి వచ్చారు. నిమజ్జనం తర్వాత కృష్ణా నది పిరమిడ్ ధ్యాన మందిరం సమీపంలో స్నానాలు చేస్తుండగా వరద ఉధృతికి కృష్ణ(17) అనే యువకుడు కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు గమనించి కాపాడేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గజ ఈతగాళ్లు వచ్చి గాలించగా అరగంట తర్వాత మృతదేహం దొరికింది.