కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఒకటో వార్డు డబుల్బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో కాంగ్రెస్ లీడర్ గాండ్ల సమ్మయ్య ఆధ్వర్యంలో లబ్దిదారులు మంత్రిని కలిశారు. 200 మంది లబ్దిదారులకు డబుల్బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించి నాలుగు నెలలు గడిచినా మౌలిక వసతులు కల్పించలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
డ్రింకింగ్వాటర్ సప్లై లేదని, ఇంటర్నల్రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. వాటర్ సప్లైకి అవసరమైన నాలుగు కమర్షియల్విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో దండు సదానందం, రహమాత్ పాషా, తుంగపిండి ప్రసాద్, బంగారి సాయి కృష్ణ తదితరులు ఉన్నారు.
