ఏసీబీ వలలో ముగ్గురు వైద్యశాఖ ఉద్యోగులు.. రూ.10 వేలు లంచం డిమాండ్​

ఏసీబీ వలలో ముగ్గురు వైద్యశాఖ ఉద్యోగులు.. రూ.10 వేలు లంచం డిమాండ్​

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు మంగళవారం రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మంచిర్యాల డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆఫీస్​కు బెల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తి తన కారు రెంట్​కు పెట్టారు. పెండింగ్ లో ఉన్న ఆరు నెలల బిల్లు రూ.లక్షా 97 వేలు చెల్లించడానికి డీఎంహెచ్ఓ ఆఫీసులో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ షఫియొద్దీన్ మార్చిలో రూ.10వేలు డిమాండ్ చేశారు. 

ఇటీవలే ఆయన రామగుండం మెడికల్ కాలేజీకి సూపరింటెండెంట్​గా ప్రమోషన్​పై వెళ్లారు. ఎన్ హెచ్ఎం (నేషనల్ ​హెల్త్​ మిషన్) జిల్లా అకౌంట్ ఆఫీసర్ దీపిక ద్వారా లంచం ఇవ్వాలని వేధించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం డీఎంహెచ్​ఓ ఆఫీసు ఎదుట టైపిస్ట్​రాజనర్సుకు రూ.10 వేలు ఇవ్వగానే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించినట్టు కరీంనగర్ జోన్ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.