తెలుగు పరిశ్రమపై నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) తాజా వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. టాలీవుడ్లో తెలుగమ్మాయిలను ప్రేక్షకులు ఎంకరేజ్ చేయడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వారికే ఇక్కడ డిమాండ్ ఎక్కువని తెలిపింది. ఒక వేళ తన వ్యాఖ్యలు నిజం కాకపోతే బిందు మాధవి, మధుశాలిని, శివాత్మిక, శివాని వంటి వారు సినిమాలు ఎందుకు చేయడం లేదని ఆమె ప్రశ్నించింది. మేకర్స్ కూడా ఇక్కడ పుట్టిన అమ్మాయిలకు చాన్స్లు ఇవ్వడం లేదని విమర్శించింది.
తాను హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేశానని కానీ, ఇక్కడ మాత్రం ఆదరణ దక్కలేదంది. అక్కడే ఉండుంటే 10 ఏళ్లలో తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయేదని.. దేవుడు దయదలిచి మళ్లీ పిలిస్తే హాలీవుడ్లో నటించడానికి రెడీగా ఉన్నట్టు మంచు లక్ష్మి తెలిపింది.