హాలీవుడ్​లో నా రేంజే వేరు..

హాలీవుడ్​లో నా రేంజే వేరు..

తెలుగు పరిశ్రమపై నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi)  తాజా వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. టాలీవుడ్​లో తెలుగమ్మాయిలను ప్రేక్షకులు ఎంకరేజ్​ చేయడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వారికే ఇక్కడ డిమాండ్​ ఎక్కువని తెలిపింది. ఒక వేళ తన వ్యాఖ్యలు నిజం కాకపోతే బిందు మాధవి, మధుశాలిని, శివాత్మిక, శివాని వంటి వారు సినిమాలు ఎందుకు చేయడం లేదని ఆమె ప్రశ్నించింది. మేకర్స్​ కూడా ఇక్కడ పుట్టిన అమ్మాయిలకు చాన్స్​లు ఇవ్వడం లేదని విమర్శించింది. 

తాను హాలీవుడ్​ లో ఎన్నో సినిమాలు చేశానని కానీ, ఇక్కడ మాత్రం ఆదరణ దక్కలేదంది. అక్కడే ఉండుంటే 10 ఏళ్లలో తన రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయేదని.. దేవుడు దయదలిచి మళ్లీ పిలిస్తే హాలీవుడ్​లో నటించడానికి రెడీగా ఉన్నట్టు మంచు లక్ష్మి తెలిపింది.