మందమర్రి కేకే-5 బొగ్గు గనిలో ప్రమాదం.. ఎయిర్ బ్లాస్ట్.. ముగ్గురికి గాయాలు

మందమర్రి కేకే-5 బొగ్గు గనిలో ప్రమాదం.. ఎయిర్ బ్లాస్ట్.. ముగ్గురికి గాయాలు

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కల్యాణి ఖని -5 బొగ్గు గనిలో ఎయిర్ బ్లాస్ట్ కావడంతో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గనిలోని 1 డిప్​, మూడో సీము, 16వ లెవల్​లో ఎక్స్ ప్లోజివ్స్ పెట్టేందుకు బొగ్గు పొరకు రంధ్రాలు చేసేందుకు కోల్​కట్టర్​ రాజశేఖర్, జనరల్​ అసిస్టెంట్లు రామిల్ల తిరుపతి, ఆవునూరి శశికుమార్ సిద్ధమయ్యారు. 

ఇదే సమయంలో వారి సమీపంలో ఒక్కసారిగా భారీ ఎయిర్​బ్లాస్ట్(రూఫ్​ఫాల్) కావడంతో ముగ్గురూ గాయపడ్డారు. గమనించిన తోటి కార్మికులు గాయపడిన వారిని రామకృష్ణాపూర్​సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

 గాయపడిన కార్మికులను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, సింగరేణి కాలరీస్ వర్కర్స్​యూనియన్​(ఏఐటీయూసీ) స్టేట్​ ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య, సెంట్రల్​వైస్ ప్రెసిడెంట్​ఎండి.అక్బర్​అలీ, సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, ఇప్పకాయల లింగయ్య, సంపత్, సీఐటీయూ ప్రెసిడెంట్​ఎస్.వెంకటస్వామి, టీబీజీకేఎస్​ లీడర్​మేడిపల్లి సంపత్ పరామర్శించారు.