ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసుల నోటీసులు

ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి పోలీసుల నోటీసులు

ఎమ్మెల్యే రాజా సింగ్ కు  పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలు పాటించకుండా  ఓ సామాజిక వర్గంపై  ఇవాళ ఫేస్ బుక్ లో రాజా సింగ్ చేసిన ఓ పోస్ట్ రెచ్చ గొట్టేలా ఉందంటూ మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై రెండురోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే నోటీసులపై స్పందించిన రాజాసింగ్..తాను ఫేస్ బుక్ లో చిన్న పోస్ట్ పెడితేనే పోలీసులు నోటీసులు జారీ చేయడం దురదృష్టకరమని అన్నారు. సీఎం కేసీఆర్, పోలీసులు తనపై ఎంత దృష్టిపెట్టారో అనడానికి  ఇదే నిదర్శనమన్నారు.

ఇప్పటికే పీడయాక్ట్ కేసులో అరెస్టయిన రాజాసింగ్ కు హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఆయనకు కండీషనల్‌ బెయిల్ మంజూరు చేసిన కోర్ట్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎలాంటి విద్వేష వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. మీడియాతో కూడా మాట్లాడవద్దని సూచించింది.