బీఆర్ఎస్, బీజేపీ నేతలు టచ్​లో ఉన్నరు

బీఆర్ఎస్, బీజేపీ నేతలు టచ్​లో ఉన్నరు
  • ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్​లో చేరికలు: మాణిక్​రావ్​ ఠాక్రే

హైదరాబాద్, వెలుగు: కర్నాటక ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరుగుతున్నదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్​రావ్ ఠాక్రే అన్నారు.  శనివారం హైదర్​గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్​లో  ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ  నేతలు చాలామంది తమతో టచ్​లో ఉన్నారని ఆయన తెలిపారు. ఖమ్మంలో రాహుల్​గాంధీ సభ తర్వాత కాంగ్రెస్​లో చేరికలుంటాయని స్పష్టం చేశారు. 

తమ పార్టీలో నేతల మధ్య కో ఆర్డినేషన్ మంచిగా ఉందని, పార్టీకి ఎస్సీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందన్నారు. పార్టీలో ఎస్సీలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎస్సీలే అని గుర్తు చేశారు.