Mani Sharma: నాపై ఎవరో బాగా ఎక్కించారు..ఆ స్టార్స్ నన్ను పట్టించుకోవట్లేదు

Mani Sharma: నాపై ఎవరో బాగా ఎక్కించారు..ఆ స్టార్స్ నన్ను పట్టించుకోవట్లేదు

మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) తన పాటలతో టాలీవుడ్ లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మణిశర్మ చేతిలో డబుల్ ఇస్మార్ట్ , కన్నప్ప సినిమాలు ఉన్నాయి. ఇదే క్రమంలో మణిశర్మకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణి శర్మ మాట్లాడుతూ..‘మహేష్, పవన్ లాంటి పెద్ద హీరోలు..అందరికీ ఒక్క ఛాన్స్ అయిన ఇవ్వాలి. DSP, తమన్ కి ఇచ్చినట్లుగానే నాలాంటి వాళ్లకు కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చిన చాలు.అప్పుడే కదా ఆడియాన్స్కు ఫ్రెష్ మ్యూజిక్ విన్న ఫీల్ వస్తోందంటూ..మణిశర్మ తెలిపారు.

 

గతంలో మహేష్ బాబుకు ఒక్కడు, మురారి, పోకిరి, ఖలేజా లాంటి ఆల్ టైం హిట్స్ఇచ్చిన మీరు..మళ్ళీ మహేష్ తో సినిమాలు చేయకపోవడానికి రీజన్ అడగగా..మహేష్ బాబుతో తన చివరి సినిమా వరకూ పూర్తి నిబద్ధతతో పని చేశానని, అయితే తర్వాత ఏం జరిగిందో, ఎవరు తనపై ఏం ఎక్కించారో తెలియదని మణిశర్మ అన్నాడు. ఏదేమైనప్పటికి 110కి పైగా చిత్రాల‌కు సంగీతం అందించిన మెలోడీ బ్రహ్మ సినిమాలు ఇవ్వండి..అనడంతో ఫ్యాన్స్ నమ్మలేకపొతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ప్రస్తుతం మణిశర్మ గ్రాఫ్ను చూసుకుంటే..మణి సార్ మెలోడీ మ్యాజిక్..ఇప్పుడు అంతగా క్లిక్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అవుతు వస్తుండటం పెద్ద మైనస్గా మిగిలిపోయింది.

రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే మణిశర్మ మళ్ళీ ఫామ్లోకి రాగా..ఇక ఆ సినిమా తర్వాత, ఆయన ఏకంగా 13 సినిమాలకు మ్యూజిక్ చేసే అవకాశాన్ని అందుకుని ఆశ్చర్య పరిచాడు. అంతే రేంజ్ లో, కనీసం యావరేజ్ గా ఆడిన ఒక్క సినిమా కూడా లేదు. మెగాస్టార్ ఆచార్య మూవీకి ట్యూన్స్ పరంగా పరవాలేదు అనిపించినప్పటికి..ఇక ఆ సినిమా స్టోరీ విషయంలో దారుణంగా డిజాస్టర్ అందుకుంది. దీంతో మణిశర్మకి దక్కాల్సిన హిట్ కనుమరుగైపోయింది. ఇక మరోసారి డబుల్ ఇస్మార్ట్ తో మణిశర్మ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది.