ఫస్ట్​ టైం వస్తున్న మాణిక్ రావు థాక్రే.. రెండు రోజులు ఇక్కడే

ఫస్ట్​ టైం వస్తున్న మాణిక్ రావు థాక్రే.. రెండు రోజులు ఇక్కడే

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్ రావు థాక్రే బుధవారం మొదటి సారి రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు థాక్రే గాంధీ భవన్ లో వివిధ స్థాయి నేతలతో భేటీ అవుతారు. తొలి రోజు ఏఐసీసీ ఇన్​చార్జ్ సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో విడివిడిగా మాట్లాడుతారు.

తర్వాత సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లను కలుస్తారు. మధ్యాహ్నం పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, పీసీసీ ఆఫీసర్ బేరర్లతో సమావేశం అవుతారు. గురువారం డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, వివిధ సెల్స్, డిపార్ట్​మెంట్ల చైర్మన్లతో మాట్లాడుతారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.